పట్టణంలోని ప్రసిద్ధ గారమ్మ తల్లి ఆలయంలో గురువారం అమ్మవారు శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. చిన్నకాపువీధి, పెద్దకాపువీధి, గెడ్డవీధి, లుంబూరువారి వీధి, గాసివీధి, గారమ్మకాలనీ, శయనవీధి తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారికి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తదితర నైవేద్య సామగ్రిని సమర్పించారు. ఆలయ ధర్మకర్త పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సోపేటి సింహాచలం ఆధ్వర్యంలో అమ్మవారిని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు, కుంకుమ పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
https://palakondatemples.blogspot.com/?m=1
No comments:
Post a Comment